Showing posts with label పండుగలూ...పబ్బాలూ...శుభాకాంక్షలూ.. Show all posts
అమ్మా, నాన్నా, మన వినాయకుడూ!
6:28 AMశ్రీ వైష్ణవ సంప్రదాయం లో విఘ్నేశ్వరాధానం లేదు. ఎందుకంటే ఇక్కడ విష్వక్సేనుడు ప్రధానం. అందుకే కొందరు సనాతన సంప్రదాయాలని పాటించే శ్రీవైష్ణవులు వినాయక చవితిని జరుపుకోరు.
అయినా వారుకూడా కొన్నిసార్లు ఆయనని పూజిస్తారు. అసలు నాకు అందిన వినాయకుని ప్రాధాన్యం ఏమిటంటే అమ్మానాన్నలని ఎంత గౌరవించాలో, వారి ప్రాధాన్యం ఏమిటో ఆయన వల్ల తెలుస్తుంది.
అంతే కాకుండా బుద్ధి బలం శారీరక బలం కన్నా ఏవిధంగా గొప్పదో ఆయన కథ వల్ల తెలుసుకోవచ్చు. అమ్మానాన్నలని గౌరవించతమనే కాన్సెప్ట్ లో మా నాన్న గారు మా కుటుంబాలలో వినాయక చవితిని ప్రవేశ పెట్టారు.
తెలుగు బ్లాగర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
అంటే వినాయక చవితి జరుపు కుంటమంటే శైవారాధానం కాదు. మన అమ్మానాన్నలని పూజించుకుంటమే.
పిల్లలకు ఆయనకు గణాధిపత్యం ఎలా వచ్చిందో తెలిపే కథను చెపుతూ ఈ విషయాన్ని ప్రాజెక్ట్ చేయవచ్చు.
సత్యమేవ జయతే!